చిత్తూరు సంత పేటలోని అమ్మఒడి సేవా సంస్థ అవినీతిపై  ప్రత్యేక కమిటీతో  విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అమ్మ ఒడి నిర్వాహకం తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆర్డీఓ, డీఎస్పీ, ఐసిడీఎస్, పీడీలను విచారణ అధికారులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షుణ్ణంగా ఆశ్రమాన్ని తనిఖీ చేసిన అధికారుల కమిటీ...  ఆశ్రమంలో పిల్లలను ఉంచడానికి నిర్వాహకుడి కి ఎలాంటి అనుమతి లేదని  గుర్తించింది.

అనాధ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు  ప్రాథమికంగా గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని, వృద్ధులను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. భవనంలో ఏదైనా ప్రమాదం ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. నిర్వాహకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేయలని పోలీసులు భావిస్తున్నారు. డబ్బుల కోసం గడ్డి తింటారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: