దుబ్బాక నియోజక వర్గంలో ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించారు. ముత్యంరెడ్డి బ్రతికున్నన్ని రోజులు దుబ్బాక అభివృద్ధి కోసం కృషి చేసిండు అని ఆయన గుర్తు చేశారు. తన ఆశయాలు నెరవేర్చడానికే తన కొడుకు శ్రీనివాస్ రెడ్డి ని పంపిండు అని అన్నారు. 12 వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే నష్టం లేదు కాని.. ప్రజల కష్టాలు మాత్రం తీరవు అని అన్నారు.


నాలుగు కోట్ల ప్రజల కష్టాలు తీరాలంటే దుబ్బాక ఎన్నికలే ప్రధాన కారణం కావాలన్నారు. చెట్టంత పెరుగుతే సరిపోదు హరీష్ రావు.. దమాక్ ఉండాలి అని ఆయనఎద్దేవాచేశారు.ముత్యంరెడ్డఆశయాలనునెరవేర్చాలంటేతనకుమారుడుశ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యే చేయాలి అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.వంద మంది ఎమ్మెల్యేలుండి కెసిఆర్ దొడ్లె పెండతీయడానికి పనిచేస్తున్నారు.. ఈ ఒక్కటి గెలిస్తే పాలు పిండుతాడా? అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: