జయశంకర్ భూపాలపల్లి లో ఇప్పుడు మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంబాపూర్ గ్రామ సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ మావోల లేఖ కనబడింది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేర కరపత్రాలు అతికించారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల అరాచకాలు పెరిగాయి అని మావోయిస్టు పార్టీ తమ కరపత్రంలో ఆరోపించింది.

గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ బంటు రమేష్ కు ప్రజా కోర్ట్ లో శిక్ష తప్పదు అని హెచ్చరించింది. గత 8 సంవత్సరాల క్రితం బోర్లగూడెం లో వెంకటేశ్వరరావు కు పట్టిన గతే.. నలుగురుకి పడుతుంది అంటూ మావోలు హెచ్చరించారు.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు లేఖలో పేర్కొన్న మావోలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: