తెలంగాణాలో గత కొంత కాలంగా మావోయిస్ట్ లు ఏం చేస్తారో అనే ఆందోళన అందరిలో ఉన్న సంగతి తెలిసిందే. మావోలు ఇప్పుడు తెలంగాణాలో బలపడే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తూ ఇటీవల అధికార పార్టీ నేతను కూడా చంపేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఇప్పుడు మావోలను మాత్రం తెలంగాణా పోలీసులు అన్ని విధాలుగా కట్టడి చేస్తున్నారు. ములుగు జిల్లాలో తాజాగా ఎన్కౌంటర్ జరిగింది.

మంగపేట మండలం రామచంద్రుని పేట సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలే టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన మావోయిస్టులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు అనే సమాచారం తెలంగాణా పోలీసులకు అందింది. దీనితో వారి కోసం గాలం వేస్తున్నారు. ఇటీవల ఈ జిల్లాలో ఒక మావోయిస్ట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: