ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో ఎప్పుడు ఏదోక వివాదాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక కార్యకర్త సెల్ టవర్ ఎక్కిన ఘటన రాయలసీమలో జరిగింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరి పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న  సెల్ టవర్ ఎక్కిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్... ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసారు. గుడిపాల మండలం వైసీపీ  కన్వీనర్ ప్రసాద్ రెడ్డి  పై పెట్టిన  ఎస్సీ ఎస్టీ కేసును నీరుగార్చారని  చీలపల్లి  గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసాడు.

ఎమ్మెల్యే  ఆరని  శ్రీనివాసులు  న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రసాద్ రెడ్డి కులం పేరుతో దూషించడం తో   ఎస్సీ ఎస్టీ  కేసు పెట్టిన రాజశేఖర్... తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ... పార్టీలో న్యాయం జరగలేదని ఆవేదన చెంది సెల్ టవర్ ఎక్కాడు

మరింత సమాచారం తెలుసుకోండి: