ఇటీవల భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. దీనితో ప్రజలకు అండగా నిలవాలి అని ప్రభుత్వాన్ని విపక్షాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయంగా  కూడా వర్షాలు కాస్త సంచలనం అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటించిన సంగతి తెలిసిందే.

ఇక నేడు ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళారు. దాదాపుగా నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ ఇలా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలి వచ్చారని నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: