అనంతపురం జిల్లాలో మళ్ళీ ఆంధ్ర - కర్ణాటక   జిల్లాల గనుల సరిహద్దు గుర్తింపు ప్రక్రియ మొదలయింది. గత రెండు సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల గురించి సర్వే నిర్వహిస్తున్నారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మరోసారి  కర్ణాటక లోని బళ్ళారి జిల్లా హలకుంది ఆంధ్ర లోని అనంతపురం జిల్లా ఓబుళాపురం గ్రామాల మధ్య సరిహద్దుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు

నేడు విఠలాపురం - సిద్దాపురం గ్రామాల మధ్య గనుల సరిహద్దుల గుర్తింపుకు సర్వే  జరుగుతుంది  అని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు, గనుల సరిహద్దుల  ప్రక్రియ ను రెండు నెలల్లో ముగించి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. కాగా గనుల సరిహద్దు విషయంలో గతంలో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సర్వే నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: