నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు పై నేడు ఏసీబీ కోర్ట్ విచారణ జరిపింది. ఈ విచారణకు ఏసీబీ కోర్టుకు  కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య, ఇతర నిందితులు హాజరయ్యారు. తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసారు. డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గత విచారణ లో ఏసీబీని కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు నేడు కోర్ట్ లో ఏసీబీ కోర్ట్ కౌంటర్ దాఖలు చేసింది.  ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఏపీ మాజీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు కూడా దీనిలో ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: