అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై జట్టుపై రాజస్థాన్​ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ 17.6​ ఓవర్లలోనే సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో జాస్​ బట్లర్​(69) కీలక పాత్ర పోషించాడు. మిగితా బ్యాట్స్​మెన్​ స్మిత్​(26), స్టోక్స్​(19) పర్వాలేదనిపించారు. ఈ విజయంతో ఫ్లేఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది రాయల్స్​.​ సీఎస్కే బౌలర్లలో దీపక్​ చాహర్​(2), హేజిల్​వుడ్ ఒక్క వికెట్​ తీశాడు.


అంతకముందు టాగ్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సీఎస్కేలో రవీంద్ర జడేజా (35*; 30 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సారథి ధోనీ (28; 28 బంతుల్లో 2x4), ఓపెనర్‌ సామ్‌కరన్‌ (22; 25 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ ధాటిగా ఆడలేకపోయారు. ఆది నుంచి వికెట్లు కోల్పోయారు. జట్టు స్కోర్‌ 13 పరుగులకే డుప్లెసిస్ ‌(10) ఔటవ్వగా తర్వాత 26 పరుగుల వద్ద షేన్‌ వాట్సన్ ‌(8) ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడు (13), సామ్‌కరన్‌ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నించినా వీరిద్దరూ వెనువెంటనే ఔటయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: