ఐపీఎల్ చరిత్రలో ధోనీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో 200 మ్యాచ్​ల మార్క్​ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్​కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇతడి తర్వాత రోహిత్ శర్మ(197 మ్యాచ్​లు), రైనా(193), దినేశ్ కార్తిక్(191) ఉన్నారు. ఈ లీగ్​లో సీఎస్కే తరఫున 4వేల పరుగులు పూర్తి చేశాడు ధోనీ.2008 నుంచి చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్​గా ఉన్న ధోనీ.. 2015 వరకు ప్రతి మ్యాచ్ ఆడాడు.



 ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ జట్టుపై రెండేళ్లు(2016-17) నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున 30 మ్యాచ్​లు ఆడాడు.ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై జట్టు.. ప్రతి సీజన్​లో ఫ్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది. మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. గతేడాది ఫైనల్లో ముంబయి చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొత్తంగా చెన్నై తరఫున 169 మ్యాచ్​లాడి 102 సార్లు జట్టును గెలిపించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: