ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యంగా.. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కొత్త కోర్సులకు అనుమతి, అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం కారణంగా.. ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వెబ్​ ఆప్షన్ల కోసం విద్యార్థులు రెండు రోజులుగా ఎదురు చూశారు.



ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షా 32 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు సమర్పించారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్​ 22 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉన్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్​లో 45 కోర్సుల్లో 69,116 సీట్లతో పాటు.. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3352, ఫార్మా-డిలో 530 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్​లో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఐఓటీ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటుకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: