హైకోర్టుకు ఈ నెల 22 నుంచి 29 వరకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాలను ఈ నెల 28న ప్రత్యేక ధర్మాసనం, సింగిల్ బెంచి విచారణ చేపట్టనుంది.జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనంతోపాటు... జస్టిస్ అభిషేక్ రెడ్డి సింగిల్ బెంచ్ అత్యవసర వ్యాజ్యాల విచారణ చేపడతాయి.


 హెబియస్ కార్పస్, బెయిల్ వంటి అత్యవసర వ్యాజ్యాలను ఈ నెల 23న దాఖలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.భూముల క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంచే అవకాశాలను ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వివరించారు. ఎల్ఆర్ఎస్​ను సవాల్ చేస్తూ కప్పర హరిప్రసాద్​రావు దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు విచారణ చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: