2021 సంవత్సరానికిగాను జూన్ -జులై నెలల్లో హజ్ యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. యాత్రికుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని నఖ్వీ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రను విరమించుకున్న సుమారు 1.23 లక్షల మందికి వారు చెల్లించిన సొమ్ము రూ.2,100 కోట్లను.. ఎలాంటి కోతలూ విధించకుండా తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
2021 సంవత్సరానికిగాను జూన్ -జులై నెలల్లో హజ్ యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. యాత్రికుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని నఖ్వీ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రను విరమించుకున్న సుమారు 1.23 లక్షల మందికి వారు చెల్లించిన సొమ్ము రూ.2,100 కోట్లను.. ఎలాంటి కోతలూ విధించకుండా తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.