ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు  బీసీలకు పదవుల రాజకీయం అనేది జరుగుతుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి గానూ ఇప్పుడు బీసీలకు అధికార విపక్షాలు పెద్ద ఎత్తున పదవులు ఇస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో మంచి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను ఆదుకోవడానికి అధికార విపక్షాలు ముందుకు వస్తున్నాయి. ఇక సిఎం జగన్ చరిత్రలో లేని విధంగా బీసీలకు పెద్ద ఎత్తున పదవులను ప్రకటించారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విమర్శలు చేసారు. “అధిరారంతో విర్రవీగిన రోజుల్లో 'అంతు చూస్తా, తోక కోస్తా' అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు.” అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: