హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యల కోసం గానూ... స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి  నిర్ణయం తీసుకున్నారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సిఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు.

సియం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం 8 స్పీడు బోటులను వెంటనే హైదరాబాదు పంపిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు.  అదే విధంగా ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ఈతగాళ్లను (డ్రైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు  ఒక ప్రకటన చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: