తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సాయికుమార్ పోలీసుల గురించి మాట్లాడారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్ చేసిన సాయికుమార్.... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా వున్నారు అని అన్నారు. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో నిల్చిన షూటింగ్ తిరిగి ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పారు.

కరోనా పట్ల‌ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. నిజమైన హీరోలు పోలీసులు ని అన్నారు. పోలీసు గెటప్ వేస్తేనే.. మాలో‌ ఒక పౌరుషం కనిపిస్తుంది అన్నారు. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా వుంటుందో అన్నారు. పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది అని ఆయన తెలిపారు. త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నా అన్నారు. కనిపించే‌ మూడు సింహాలు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: