ఏపీలో బీసీలను ఆకట్టుకోవడానికి అధికార విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో కీలక పదవులను అధికార విపక్షాలకు బీసీలకు ఇచ్చాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... టిడిపి అంటే బిసిల పార్టీ అని అన్నారు. నాతో పాటు 60 శాతం పొలిట్ బ్యూరో పదవులు బీసీలకు కేటాయించారు అని ఆయన పేర్కొన్నారు.

టిడిపిని అధికారంలోకి తెచ్చేవరకు కాళ్లకు గజ్జెకట్టి తిరుగుతాం అని ఆయన స్పష్టం చేసారు. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేరుస్తాం అని ఆయన స్పష్టం చేసారు. బిసిలకు ఎక్కువ శాతం కార్పొరేషన్ చైర్మన్ లు ఇచ్చామని జగన్ గొప్పలు చెబుతున్నారు అని అన్నారు. అవి నాలుక గీచుకోవటానికి పనికిరావు ని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ చెప్పిన దానికి తలూపటానికే పదవులు అని అన్నారు. కింజరాపు కుటుంబంపై చంద్రబాబు, లోకేష్ పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: