సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని నందిగామ శంకరయ్య (68) ఆత్మహత్య   చేసుకున్న ఘటన సంచలనం అయింది. ధరణి సర్వేకు వచ్చిన వాళ్ళు తన ఫోటో తీసుకోలేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. శంకరయ్య అన్న పేరిట ఉన్న ఇళ్లు , ఖాళీ స్థలం ఉన్నాయి.

ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఆస్థి ఉంటే వారి ఫోటో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. జాయింట్ ప్రాపర్టీ కావడంతో శంకరయ్య అన్న ఫోటో మాత్రమే సర్వే బృందం  తీసుకుంది. సర్వే రిపోర్టులో శంకరయ్య పేరు, ఆధార్ నెంబర్ నమోదు చేసిన సర్వే బృందం... శంకరయ్య ఫోటో తీసుకోకపోవడంతో తన పేరిట ఉన్న ఖాళీ స్థలం దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి ఇంద్రకరణ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: