ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు చేసింది. ఐఎండి వాతావరణ సూచనలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు  నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,  కృష్ణా,గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.

శ్రీకాకుళం,  విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు పలుచోట్ల  తేలికపాటి  జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కే కన్న బాబు ప్రకటించారు.  కాగా ఏపీలో పలు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: