ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను కరోనా వైరస్ కంగారు పెడుతుంది. జిల్లా నేతల్లో చాలా మంది కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది. జిల్లాలో కూడా కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పుడు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సమర్ధవంతంగానే వ్యవహరించింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కీలక టీడీపీ నేతలు కొందరు జిల్లాలో కరోనా బారిన పడ్డారు.


జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావులకు పాజిటివ్ గా నిర్ధారణ యింది. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రులలో పోతుల రామారావు, దామచర్ల పూర్ణచంద్రరావు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న ఎమ్మెల్యే ఏలూరి, ఫోన్ లో పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: