కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చంపేశారు అమ్మాయి తరుపు బంధువులు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లె గ్రామంలో ప్రణయ్ హత్య సంచలనం అయింది. ఈ హత్యకు  ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు వెల్లడించారు. అడిషనల్ డిసీపీ శ్రీనివాస్  మాట్లాడుతూ... తన సోదరిని ప్రేమిస్తున్నాడని కక్ష్య పెంచుకున్న అనిల్ ప్రణయ్ ని హత్య చేశాడు అని చెప్పారు.

తన చెల్లెలితో ప్రేమ వ్యవహారం  కొనసాగించడం ఇష్టం లేక ప్రణయ్ ని  దారుణంగా హత్య చేసినట్లు నిర్దారణ అయింది అని అన్నారు. గత రాత్రి అనిల్  సోదరితో  ప్రణయ్ మాట్లాడుతుండగా చూసి ఆవేశంతో ఒక్కసారిగా  ప్రణయ్ ని కర్రలతో  కొట్టి చంపారు అని అన్నారు. హత్యపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: