అనంతపురం జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. హిందూపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మోడల్ కాలనీలో చాంద్ భాషా అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసారు. తన కుమారుడు పెళ్లి సంబంధం ఆడిగేందుకు వెళ్లిన చాంద్ బాషా పై ఒక్కసారిగా దాడి చేసారు అమ్మాయి తరుపు బంధువులు. చాంద్ భాషా కుమారుడు సైఫుల్లా మోడల్ కాలనీకి చెందిన ఓ యువతి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.

యువతి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం అడగడం తో ఒక్కసారిగా ఆగ్రహంతో అమ్మాయి బంధువులు కత్తులతో దాడి చేసారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చాంద్ భాషాను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న హిందూపురం టౌన్ పోలీసులు... నిందితుల మీద హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: