తెలంగాణాలో, ప్రధానంగా హైదరాబాద్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో దారుణంగా పరిస్థితి. దీనితో ఇప్పుడు ఎవరికి వారుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కోటీ 50 లక్షలు సహాయం చేయగా తాజాగా అక్కినేని నాగార్జున కూడా ముందుకు వచ్చారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణ ఉపశమనం కోసం 550 కోట్లు విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ సిఎం సహాయ నిధికి 50 లక్షలు తక్షణ సహాయం చేస్తున్నామని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: