సీఎం జగన్ మోహన్ రెడ్డిని విజయవాడలో హత్యకు గురైన దివ్య తేజస్వి తల్లిదండ్రులు కలిసారు. రాష్ట్ర హోం మంత్రి సుచరితతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని దివ్య తేజస్వి తల్లిదండ్రులు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసారు. సీఎంని కలిసే ఏర్పాటు చేయాలని  హోంమంత్రి సూచరితను దివ్య కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీనితో దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో  సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు చొరవ చూపించారు హోం మంత్రి.

తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు... తమకు న్యాయం చేయాలని, నిందితుడుకి కఠిన శిక్ష పడాలి అని కోరారు. తేజస్వి హత్య కేసులో విచారణ ను వేగవంతం చేసిన పోలీసులు... నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: