తెలంగాణాలో ఇప్పుడు ఒక బాలుడి కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.  మహబూబా బాద్ లో  ఇప్పుడు ఈ బాలుడి కోసం పెద్ద ఎత్తున పోలీసులు గాలిస్తున్నారు. 45 గంటలు దాటినా బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి లభించలేదు.  కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమ బాలుడ్ని రక్షించాలి  అని అధికారులు కోరుతున్నారు.

గంట గంటకు టెన్షన్ పెరిగిపోతుంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులకు అసలు ఏ సమాచారం కూడా ఇప్పటి వరకు లభించలేదు. బాలుడి ఆచూకీపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో  అసలు పోలీసులకు ఏ సమాచారం కూడా ఇప్పటి వరకు రాలేదు. బాలుడి తల్లిదండ్రులను మరోసారి విచారించే అవకాశం ఉంది. పోలీసుల అదుపులోనే రంజిత్ రెడ్డి సోదరుడు మనోజ్ ఉన్నాడు. అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: