హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం చాలా కష్టంగా ఉంది. భారీగా వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే ఇల్లు కాళీ చేసి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దు అని పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణం శాఖ హెచ్చరికలతో మాదాపుర్ శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం లకు సెలవలను ప్రకటించారు శిల్పారామం అధికారులు. మంగళవారం, బుధవారం రెండు రోజులు శిల్పారామం కు సందర్శకులను అనుమంతించమని శిల్పారామం అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: