హైదరాబాద్ లో భారీ వర్షాల దెబ్బకు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పెట్ చెరువు కట్ట  తెగింది అనే వార్తలు వచ్చాయి. దీనితో అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక  మీర్ పేట చెరువు కట్ట తెగిందనే ప్రచారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ఖండించారు. మీర్ పేట చేరువు కట్ట తెగిందనే ప్రచారం జరుగుడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్న సబితా రెడ్డి... అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉండి పరిస్థితులను  ఆమె సమీక్షిస్తూ పలు సూచనలు కూడా అధికారులకు చేసారు. చెరువు కట్టను ఆమెను పరిశీలించారు. వాటర్ లీక్ అయ్యే ప్రాంతంలో ఇసుక బస్తాలు వేయడంతో  కట్ట పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదు అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: