ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనగానే చాలా మంది ఆయన నోటి నుంచి వ్యాక్సిన్ కి సంబంధించి ప్రకటన వస్తుంది అని అందరూ భావించారు. కాని మోడీ తన ప్రసంగంలో వ్యాక్సిన్ కి సంబంధించి ఏ ప్రకటన చేయలేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కోసం  ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశం కూడా శ్రమిస్తుంది అని అన్నారు.

వ్యాక్సిన్ గురించి అందరం ఎదురు చూస్తున్నామని అన్నారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని మోడీ పేర్కొన్నారు. పండుగల సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు. ఇక మోడీ ప్రసంగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జనాలు... ఏమీ లేకపోవడంతో షాక్ అయ్యారు. చాలా మంది చాలా ఊహించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: