కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ హ్యాట్రిక్​ విజయాన్ని అందుకుంది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో నికోలస్​ పూరన్​(53), మ్యాక్స్​వెల్​(32) క్రీలక పాత్ర పోషించారు. మిగితా వారు నామమాత్రంగా రాణించారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది. పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో రబాడా(2), అక్సర్ పటేల్​, అశ్విన్​ తలో వికెట్​ తీశారు.


అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్లో ధావన్ మళ్లీ శతకంతో గర్జించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ చరిత్ర సృష్టించాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (14), రిషభ్ పంత్‌ (14) కాసేపు అతడికి తోడుగా నిలిచారు. మిగితా వారు విఫలమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: