అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు సహకరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​షా.. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​కి హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సైతం.. ఇరురాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోనోవాల్‌కి సూచించారు.మరోవైపు హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా నేతృత్వంలో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌ సమావేశం జరిగింది.


 అంతర్రాష్ట్ర సరిహద్దులో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ వివాదం చెలరేగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు భల్లా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆదివారం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య జరిగిన భారీ ఘర్షణ గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం మంత్రిత్వశాఖకి అసోం ముఖ్యమంత్రి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: