జమ్ముకశ్మీర్​ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మెల్​హురా, జైనాపురా ప్రాంతాల్లో తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత దళాలకు తారసపడిన ఉగ్రవాదులు... సైన్యంపైకి కాల్పులకు తెగపడ్డారు.


దీంతో సైన్యం ఎదురు కాల్పులు జరపగా... ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం మరో గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఘటనాస్థలంలో ఏకే రైఫిల్, పిస్తోల్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది సైన్యం. సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లోనూ ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: