తమిళనాడు చెన్నైలోని టీనగర్​లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ షాపింగ్ మాల్​కు సీలు వేశారు చెన్నై కార్పొరేషన్​ అధికారులు. టీ నగర్​లోని కుమారన్​ సిల్క్స్​ మాల్ కరోనా నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో వినియోగదారులకు ప్రవేశం కల్పించి... భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించింది.

ఈ మేరకు సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు... మాల్​ వద్దకు చేరుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపు యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధరించుకొని అధికారులు సీల్​ వేసినట్లు తెలుస్తోంది.తమిళనాడులోని ఓ షాపింగ్​ మాల్​కు సీల్​ వేశారు చెన్నై కార్పొరేషన్​ అధికారులు. కొవిడ్​ నిబంధనలు ఉల్లఘించి... భారీ సంఖ్యలో వినియోగదారులను అనుమతించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: