కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐదు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.విపక్ష పార్టీలు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, లోక్​ ఇన్సాఫ్ పార్టీల సభ్యులు బిల్లులకు మద్దతిచ్చారు. బిజేపి ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు.


వ్యవసాయ ఒప్పందంలో భాగంగా వరి, గోధుమలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.బిల్లుల విషయమై మంగళవారం సాయంత్రం పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్​ను సీఎం అమరీందర్ కలిశారు. నాలుగు బిల్లులతో పాటు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం గురించి గవర్నర్​కు వివరించారు. ఆప్ ఎమ్మెల్యే హర్​పాల్ సింగ్ చీమ, శిరోమణి అకాలీదళ్ నేత శరన్​జీత్ సింగ్ ధిల్లాన్ సహా పలువురు నేతలు అమరీందర్​తో కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: