బిహార్లో రైలు ప్రమాదం జరిగింది. సమస్తీపుర్-ముజఫర్పుర్ మార్గంలో ప్రయాణిస్తున్న పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు బోగీలు అదుపుతప్పాయి. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.విజయదశమి సందర్భంగా గోరఖ్​పుర్​-కోల్​కతా మధ్య ప్రత్యేకంగా ఈ రైలును నడపుతున్నారు.

ఇదే విధంగా మరో ప్రమాదం కూడా చోటు చేసుకుంది.ఒడిశా పూరీ జిల్లాలోని చందన్​పుర్-తులసిచౌరా మధ్య ఓ రైలు పట్టాలు తప్పింది. ఖుర్దా రోడ్​ జంక్షన్​ నుంచి పూరీ వెళ్తున్న మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది. రెండు ఇంజన్లు మాత్రమే పట్టాలు తప్పాయి.ఈ మేరకు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: