ఆంధ్రప్రదేశ్ లో దేవాలయలపై దాడులు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. అటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. తూర్పు గోదావరి  జిల్లా తాళ్ళరేవు మండలం లచ్చి పాలెం గ్రామంలో బైపాస్ కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయం లో హనుమంతుడు విగ్రహాన్ని ధ్వంసం చేసారు  గుర్తు తెలియని దుండగులు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీ కృష్ణ, కోరంగి ఎస్సై సతీష్ అక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా శివాలయంపై దాడి చేసిన దుండగులు హుండీ ఎత్తుకుపోయారు. కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: