కరోనా నిర్వహణ విషయంలో ముందు నుంచి కూడా పోలీసులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ప్రతీ ఒక్క పోలీసు అధికారి కూడా తమ శక్తికి మించి కష్టపడుతున్నారు.  ఈ క్రమంలోనే కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి దేశ వ్యాప్తంగా నివాళి కూడా అర్పిస్తున్నారు.

తాజాగా హోం మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ పోలీస్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనాకు వైరస్ కు వ్యతిరేకంగా... మన యుద్ధంలో , 343 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలు వెలకట్టలేనివి అని ఆయన  మాట్లాడుతూ అన్నారు. దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: