మన దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నాయి. మూడు నెలల  తర్వాత మన దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులను సమర్ధవంతంగా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తుంది. ఇక భారత్‌ లో గత 24 గంటల్లో కొత్తగా 54 వేల 044  కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.  717 మంది మృతి చెందారు నిన్న ఒక్క రోజే.

76  లక్షల 51 వేల 108కు పాజిటివ్ కేసులు చేరుకున్నాయి.  ఇప్పటి వరకు 1 లక్షల 15 వేల 914 మంది మృతి చెందారు.  7 లక్షల 40 వేల 090 యాక్టివ్‌ కేసులు మన దేశంలో ఉన్నాయి అని కేంద్రం చెప్పింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 67 లక్షల 95 వేల 103 మంది రికవరీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: