హైదరాబాద్ లో వరదల దెబ్బకు ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎప్పుడు ఎం జరుగుతుందో నే ఆందోళన అందరిలో కూడా ఉంది. చాలా వరకు కూడా  హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మంత్రి కేటిఅర్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే హైదరాబాద్ వరదల మీద ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే తాజాగా కేంద్రం తన బృందాన్ని హైదరాబాద్ కు పంపించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం హైదరాబాద్ లో పర్యటిస్తుంది.  రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సెంట్రల్ టీం... వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. కీలక అధికారుల బృందం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: