భారత్ చైనా సరిహద్దుల్లో చైనా ఆర్మీ వ్యవహారం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. భారత్ లోకి వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక   చైనా  ఆర్మీ సైనికుడు భారత్ లోకి అడుగు పెట్టాడు. దీనితో భారత ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. అసలు అతను ఎందుకు వచ్చాడు అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

అతను కచ్చితంగా భారత్ సరిహద్దుల్లో ఉన్న భద్రతను చూడటానికి వచ్చి ఉంటాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు సరిహద్దుల్లో ఉన్న భారత ఆర్మీ వద్ద ఉన్న ఆయుధాలను కూడా అతను గమనించి ఉంటాడు అని  అంటున్నారు. కాబట్టి భారత ఆర్మీ అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సరిహద్దుల నుంచి అతనిని చైనా ఆర్మీకి అప్పగించారు. నిన్న సాయంత్రం అతన్ని అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: