హైదరాబాద్ లో వరదల ముప్పు ఇంకా అలాగే ఉంది. భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరబాద్ లో దాదాపుగా అన్ని  ప్రాంతాల్లో వరదలు ఉన్నాయి. ఇక  ఇదిలా ఉంటే హైదరాబాద్ జూ పార్క్ కి భారీగా వరద ముప్పు పొంచి ఉంది. ఓల్డ్ సిటీ లోని మిరాలం చెరువు కు భారీగా వరద నీరు చేరుకుంది.

ఏ క్షణమైనా చెరువుకు గండి పడే అవకాశం ఉండవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. దీనితో అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చెరువు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలంటూ అధికారుల హెచ్చరికలు చేసారు. ఇప్పటికే చెరువు పక్కనే ఉన్న జూ పార్క్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఇక విపత్తు నిర్వహణ బృందాలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: