తెలంగాణా తొలి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమంగా మారుతుంది. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారులు కూడా ఏ విషయం చెప్పడం లేదు. ఇక ఆయన ఆరోగ్యం ఇప్పుడు మరింత విషమంగా మారింది అని తెలుస్తుంది. మాజీ మంత్రి నాయిని పరిస్థితి మరింత విషమం అని  ఆయన చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

కాసేపట్లో అపోలో హాస్పిటల్ కి సిఎం కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉంది.  ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.  ఆయన ఇటీవల కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషమంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: