అమరావతి- తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ  సహా మరో 13 మండలాలను విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ పురపాలక శాఖ. తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వరదయ పాలెం, సత్యవేడు  మండలాల్లో విస్తరించిన శ్రీ సిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీ సిటీ సెజ్ ప్రస్తుతం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోఉన్నందున తుడా నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరటంతో 4472 చదరపు కిలోమీటర్లకు తుడా పరిధి పెరిగింది. వీటి అభివృద్ధి మీద ప్రత్యేకంగా సర్కార్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: