ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ఏదోక వివాదంలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కోర్ట్ లు కూడా పోలీసుల తీరుపై ఇప్పుడు కాస్త ఆగ్రహంగా ఉన్నాయి. తాజాగా  మరో సిఐ వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది. గురజాల ఎక్సైజ్ సిఐ వేదింపులు  తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. పురుగు మందు తాగి లాల్ బీ అనే మహిళ ఆత్మహత్యయత్నం చేసారు.

దాచేపల్లి కు చెందిన లాల్ బీ కుటుంబం పై పీడీ యాక్ట్ పెడతానని సిఐ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓ సారి మద్యం అమ్ముతూ లాల్ బీ కొడుకులు దొరికారు. మద్యం వ్యాపారం మానేసి కూలీ పనులు చేసుకుంటున్నాం అని, అయినా సిఐ దేవర శ్రీనివాస్ వేదిస్తున్నాడు అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: