ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల కరోనా వైరస్ తగ్గినా సరే మరికొన్ని చోట్ల మాత్రం కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. దీనితో  ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ ఒక ప్రాంతంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం కనపడుతుంది. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలుకు అధికారులు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే దేవరగట్టు బన్ని ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసారు. హోలగుంద మండలం నెరణికిలో మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించి బన్నీ ఉత్సవాలను ఎక్కువగా భక్తులు లేకుండా ప్రారంభించారు. అర్చకులు, స్ధానికులు, ఇవాళ సాయంత్రం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలను దేవరగట్టుకు నెరణికి, నెరణికితాండ, కొత్తపేట గ్రామస్తులు తీసుకు వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: