ఏపీ మంత్రి అప్పల రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. సిక్కోలు టిడిపి నేతలపై మంత్రి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేసారు. తితిలీ తుఫాన్ పరిహారాన్ని అనర్హుల ఖాతాల్లో జమచేసి మెక్కేసిన దొంగలు టిడిపి నేతలు అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసారు. మత్స్యకార భరోసా పై అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. టిడిపి నేతల దగుల్బాజీ మాటలు విని పరిస్థితిలో మేము లేమని ఆయన అన్నారు.

3 రాజధానుల విషయంలో సవాల్ లు ఎందుకు అచ్చెన్నాయుడు ను రాజీనామా చేయమనండి అని సవాల్ చేసారు. అచ్చెన్న రాజీనామా చేస్తే వైసీపీ పోటీకి దిగుతుందని అన్నారు. ప్రజాభిప్రాయం ఎవరివైపు ఉందో తేలిపోతుంది అని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ కోసం టిఆరెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాష్ట్రం సాధించుకున్నారు అని మంత్రి గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: