అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోహ్లీసేన మరోసారి అదరగొట్టింది. కోల్​కతా నైట్​ రైడర్స్​ను చిత్తుగా ఓడించి.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 85 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 13.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీసేన విజయంలో బౌలర్​ సిరాజ్​(3), చాహల్​(2), నవదీప్​ సైని, వాషింగ్టన్​ సుందర్​ తలో వికెట్​ తీసి కీలక పాత్ర పోషించారు.



అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా జట్టు.. ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1ఫోర్​, 1 సిక్సర్​) ఆదుకోవడం వల్ల బెంగళూరుకు కోల్‌కతా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కోల్‌కతాను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: