సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా కార్పరల్ వాంగ్ యా లాంగ్‌ను చైనాకు అప్పగించింది భారత సైన్యం. చుషూల్ మోల్డో మీటింగ్ పాయింట్​ వద్ద చైనా సైనికుణ్ని మంగళవారం రాత్రి పీఎల్‌ఏకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది.


తూర్పు లద్దాఖ్‌లో దెమ్‌చోక్‌ వద్ద వాంగ్ యా లాంగ్​ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సైనికుడు గూఢచారిగా భారత్​కు వచ్చారా? లేక మరేదైనా ప్రణాళికతో వచ్చారా అనే అంశంపై భారత సైన్యం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి వాంగ్‌ను చైనాకు అప్పగిస్తామన్న సైన్యం...ఆ మేరకు మాట నిలబెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: