మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 34మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.జల్​గావ్​​ నుంచి గుజరాత్​లోని సూరత్​కు వెళుతున్న ఓ బస్సు కొండైబరీ ఘాట్​ వద్ద 40 అడుగుల లోయలో పడింది. ప్రాంతంలోని ఓ మలుపు వద్ద బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.


మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని ఇంద్రావతి నదిలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు అయ్యారు.సమాచారం అందుకున్న ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో 13 మందిని రక్షించాయి. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు సురక్షితంగా బయటపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: