బిహార్​ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశాయి కాంగ్రెస్​, లోక్​జనశక్తి పార్టీ (ఎల్​జేపీ).పట్నాలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు ఎల్​జేపీ అగ్రనేత చిరాగ్​ పాసవాన్​. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​పై విమర్శలు గుప్పించారు.


మేనిఫెస్టో విడుదల కోసం పార్టీ కార్యాలయానికి వెళ్లే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు చిరాగ్​ పాసవాన్​. మేనిఫెస్టో పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని సింధూర తిలకం దిద్ది ఆశీర్వదించారు పాసవాన్​ తల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: