ట్రిపుల్ తలాక్​ చట్టం తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన షయారా బానోకు ఉత్తరాఖండ్​ రాష్ట్ర మహిళా కమిషన్​లో ఉపాధ్యక్షురాలిగా చోటు కల్పించింది. ఆమెతోపాటు మరో ముగ్గురు మహిళలకూ అవకాశం దక్కింది. 'నవరాత్రి శుభ దినాన రాష్ట్ర మహిళలకు ఉత్తరాఖండ్​ సీఎం ఇచ్చే బహుమతి ఇది' అని సీఎం కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్ సింగ్​ రావత్​ తెలిపారు.2014లో ట్రిపుల్ తలాక్​ పై సుప్రీంకోర్టులో పోరాడిన మొదటి ముస్లిం మహిళగా షయానా బానోకు గుర్తింపు ఉంది. పదిరోజుల క్రితం ఆమె ఉత్తరాఖండ్​ బిజేపి అధ్యక్షుడు బన్సీధర్ భగత్ సమక్షంలో పార్టీలో చేరారు.


దేశంలోనే మొదటి సారిగా ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ప్రశ్నించిన ముస్లిం మహిళ షయారా బానోకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంత్రి పదవిని కల్పించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్​ సింగ్​ రావత్ వెల్లడించారు. బిజేపి లో చేరిన పది రోజులకే షయారాకు ఈ పదవి దక్కడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: